పంజాగుట్టలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. జర్నలిస్ట్ దుర్మరణం

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ప్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్తున్న కారు..

ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నది.

ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న పత్రికా జర్నలిస్ట్ మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ప్లైఓవర్‌పై నుంచి కిందపడి మృతి చెందాడు.

మరోవైపు బైక్ పూర్తిగా ధ్వంసం అయ్యింది.

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. మృతుడు కరీంనగర్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.

అయితే కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో బీభత్సం సృష్టించడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని వాహనదారులు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..