చిలకలూరిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురు మృతి
గుంటూరు జిల్లా
చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది
తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న 11 మంది భక్తులతో కూడిన ఫార్చ్యూన్ వాహనం ఆగి ఉన్న లారీని శరవేగంతో ఢీకొనడంతో వాహనంలో ఉన్న ఐదుగురు, ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్ద వాళ్లతో మొత్తం ఐదుగురు సంఘటనా స్థలంలో మరణించారు
మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఆరుగుర్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు
వాహనంలో డ్రైవరు ఇరుక్కుపోవడంతో జెసిబి సాయంతో బయటకు తీసి రక్షించారు
వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బు వారి పాలెం గ్రామానికి చెందిన వారు, వీరంతా ఫోటోగ్రఫీ పూర్తిగా చేసుకుంటూ ఇరు కుటుంబాల వారు తిరుపతి దైవ దర్శనం నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ఘోర సంఘటన జరిగింది
నరసరావుపేట డి.ఎస్.పి రామ వర్మ హుటాహుటిన చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు
మృతులు...1) సూర్య భవాని 22 సంవత్సరాలు, 2)వెంకట్ 30 సంవత్సరాలు, 3)గీతేశ్వరి బాబు 4 సంవత్సరాలు,4) సోనాక్షి 5 సంవత్సరాలు, 5)మనోజ్ 22 సంవత్సరాలు.
Comments
Post a Comment