గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు

*గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు*

ఢిల్లీ: గ్యాస్‌ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) గుడ్ న్యూస్ చెప్పింది.

సబ్సిడీలేని గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.100.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ గ్యాస్‌ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం సబ్సిడీలేని ఎల్పీజీ ధర దిల్లీలో రూ.737.50గా ఉంది. అది రూ.637కు తగ్గనుంది.

సవరించిన రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇక సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.494.35గా ఐవోసీ నిర్ణయించింది.

వినియోగదారులు ఒకసారి ఎల్పీజీ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీగా చెల్లించే రూ.142.65 బ్యాంకు ఖాతాలో పడనుంది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..