కాశీబుగ్గ రోటరీ నగర్లో దారుణం
శ్రీకాకుళం: కాశీబుగ్గ రోటరీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. గొడవ నేపథ్యంలో క్రికెట్ బ్యాట్తో భార్యను కొట్టబోతే కుమారుడికి తగిలి ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడం పెను విషాదానికి దారి తీసింది. రోటరీ నగర్లో నివాసముండే వినోద్ దంపతుల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వినోద్ క్రికెట్ బ్యాట్తో భార్యను కొట్టబోయాడు. ఆమె తప్పుకోవడంతో అది కుమారుడికి తగిలి.. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Post a Comment