జిల్లా పోలీసు కార్యాలయంలో ఇకనుండీ ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం
--సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విజ్ఞప్తి
- ఉదయం పది గంటల నుండే జిల్లా ఎస్పీ అందుబాటులో ఉంటూ అర్జీలు స్వీకరిస్తారు
- ప్రజలు స్వేచ్ఛగా సమస్యలు విన్నవించుకోవచ్చు
అనంతపురం: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని...
జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విజ్ఞప్తి చేశారు.
ఉదయం పది గంటల నుండీ తాను జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో అందుబాటులో ఉంటానన్నారు.
ప్రజలు స్వేచ్ఛగా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వినతులు అందజేయవచ్చన్నారు.
పాలన పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం గ్రీవెన్స్ డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఇందులో భాగంగానే జిల్లాలో ప్రతీ సోమవారం సమర్థవంతంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Comments
Post a Comment