దళిత యువకుడితో లేచిపోయిందని.... చెల్లెల్ని చితకబాదిన అన్నలు

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ కులం కాని వ్యక్తిని ప్రేమించి...అతడితో లేచిపోవడానికి ప్రయత్నించిందని యువతిని పట్టుకొని చావబాదారు... ఆమె కుటుంబసభ్యులు. బైక్‌పై వెళ్తున్న యువతిని పట్టుకొని కర్రలతో దారుణంగా కొట్టారు. ఆమె వద్దని బతిమాలాడిన వినిపించుకోలేదు. జూన్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగోలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ధర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే యువతికి కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు అన్నల్ని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 22 ఏళ్ల యువతి దళిత యువకుడ్ని ప్రేమించింది.అతడితో తన జీవితం పంచుకోవాలనుకుంది. ఈవిషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. తమకులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల కంటపడింది. బైక్‌పై వెళ్తున్న ఆమెను అడ్డుకున్న అన్నలు... కొండపై తీసుకెళ్లి చావబాదారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. వద్దని ఎంత బతిమాలాడిన వినలేదు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వీడియోలో రికార్డ్ అయిన దృశ్యాల్ని పరిశీలించిన పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా దాడికి దిగిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..