జులై 1 నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు

అమ‌రావ‌తి : 

సీఎం క్యాంపు కార్యాలయంలో జులై 1 నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి సీఎంవో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం స్వయంగా ప్రజానికాన్ని కలిసేందుకు ప్రజాదర్బార్‌ కార్యక్రమం చేపడుతున్నారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజాదర్బార్‌ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలను ప్రతిరోజు గంటపాటు కలుసుకునేందుకు వీలుగా ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు. ప్రజాదర్బార్‌లో సీఎం జగన్‌ ప్రజల నుంచి నివేదికలు, వినతులు స్వీకరించనున్నారు. సమస్యల పరిష్కారానికి సీఎం తగిన చర్యలు తీసుకోనున్నారు. ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారి కార్యక్రమాలు చేపట్టనున్నారు. జగన్‌ క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రజాదర్బార్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..