విజయవాడ నగరంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది
విజయవాడ: విజయవాడ నగరంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఏలూరు రోడ్డులోని మమతా హోటల్ వద్ద ఆగివున్న కారును ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొంది. ఆ సమయంలో కారులో, స్కూల్ బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారుడికి స్వల్పగాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. గవర్నర్పేట ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Post a Comment