ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు.
అమరావతి
సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. 7 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎంకు పార్టీ నేతలు స్వాగతం పలకనున్నారు.
అనంతరం రోడ్డు మార్గాన తూర్పు నౌకాదళ స్థావరం(ఈఎన్సీ)కు చేరుకుంటారు.
అక్కడ జరిగే సమావేశంలో పాల్గొని.. రాత్రి 7.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నావికాదళ అధికారులతో జగన్ భేటీ కానున్నారు.
రాత్రి 8.15 గంటలకు రక్షణమంత్రి, సిబ్బందితో కలసి భోజనం చేస్తారు.
రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరతారు.
Comments
Post a Comment