మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది.

పుణె: మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది. పుణెలోని కుంద్వాలో భారీ వర్షం ధాటికి ఈ తెల్లవారుజామున గోడకూలి 17 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. గోడ కూలి కాంప్లెక్స్‌ పక్కనే వలస కూలీలు నివసిస్తున్న రేకులషెడ్లపై పడింది. తెల్లవారు జామున ఘటన జరగడంతో ఆసమయంలో అందరూ నిద్రిస్తున్నారు. దీంతో వారంతా విగతజీవులయ్యారు. మృతులంతా బిహార్‌, బెంగాల్‌కు చెందిన భవన నిర్మాణ కూలీలే నని అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శిథిలాల కింద కార్లు, ఆటోలు చిక్కుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లెయిన్‌ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..