కిత్నా అచ్చా హై మోదీ .... మోదీతోనే సెల్ఫీ దిగిన ఆసీస్ ప్రధాని
జపాన్ : సెల్ఫీలు దిగడంలో ప్రధాని మోదీని మించినవారండరు.
కానీ మోదీతోనే సెల్ఫీ దిగారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్.
జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొంటున్న ఇద్దరు నేతలు కాసేపు సరదాగా గడిపారు.
అయితే ఆసీస్ ప్రధాని స్కామ్ మారిసన్.. మోదీతో సెల్ఫీ దిగారు.
దానికి కిత్నా అచ్చా హై మోదీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
హిందీలో ఆయన కామెంట్ చేశారు.
మారిసన్ ట్వీట్ చేసిన పోస్టును నెటిజన్లు రీట్వీట్లు చేస్తున్నారు.
కొన్ని గంటల్లోనే అది వైరల్గా మారింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
Comments
Post a Comment