విద్యార్థుల గొంతెండుతోంది

విద్యార్థుల గొంతెండుతోంది!!

నెల్లూరు జిల్లా ఓజిలి  మండలంలో ఉన్న అర్మేనిపాడు  ఉన్నత పాఠశాలలో   గత నెల రోజులుగా బోరు పనిచేయక  పనిచేయకపోవడంతో విద్యార్థులు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

అక్కడ 140 మందికి పైగా విద్యార్థులుండగా ఉన్న బోరు ఎండిపోవడంతో  వారు  ఇంటి  వద్ద నుoడి  వాటర్ బాటిల్ లో నీరు  తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

దాహం తీరక   పాఠశాలలో నీరు లేకపోవడంతో   సాయంత్ర0  ఇంటికి వెళ్లి నీరు త్రాగవలవస్తోంది.

సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డీ. ఓ కు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని తెలుస్తోంది.

ఇప్పటికైనా  పంచాయతీ అధికారులు   మండల అధికారులు స్పందించి   బోరును రిపేరు చేయించి విద్యార్థులకు త్రాగు నీరు అందించాలని   విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది