జులై 1 న ఇంటర్ మార్కుల జాబితా విడుదల
అమరావతి : జులై 1 వ తేదీ నుండి జ్ఞాన భూమి వెబ్ సైట్ లో ఇంటర్ మార్కుల జాబితాను అందుబాటులో ఉంచుతామని ఎపి ఇంటర్ బోర్డు తెలిపింది.
ఈ మార్కుల జాబితాను విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
జూలై 1 న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
ఈ మేరకు ఎపి ఇంటర్ బోర్డు ఓ ప్రకటనను జారీ చేసింది.
Comments
Post a Comment