183 మంది ప్రయాణికులతో రన్వేపై దిగిన విమానం
బెంగళూరు
183 మంది ప్రయాణికులతో రన్వేపై దిగిన విమానం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న పచ్చిక బయలులోకి దూసుకుపోయింది.
కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
సాయంత్రం 5.40 గంటలకు దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 380 విమానం రన్వే నుంచి మైదానంలోకి దూసుకుపోతుండటంతో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా దాన్ని నిలిపివేశారు.
ఈ ఘటనపై ఎయిరిండియా విచారణకు ఆదేశించింది.
ఎక్కడ తప్పు జరిగిందనేది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణలో తేలనుంది.
2010లో రన్వే నుంచి విమానం కిందకు వెళ్లి ప్రమాదానికి గురవడంతో 158 మంది మరణించారు.
Comments
Post a Comment