183 మంది ప్రయాణికులతో రన్‌వేపై దిగిన విమానం

బెంగళూరు

183 మంది ప్రయాణికులతో రన్‌వేపై దిగిన విమానం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న పచ్చిక బయలులోకి దూసుకుపోయింది.

కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

సాయంత్రం 5.40 గంటలకు దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 380 విమానం రన్‌వే నుంచి మైదానంలోకి దూసుకుపోతుండటంతో అప్రమత్తమైన పైలట్‌ చాకచక్యంగా దాన్ని నిలిపివేశారు.

ఈ ఘటనపై ఎయిరిండియా విచారణకు ఆదేశించింది.

ఎక్కడ తప్పు జరిగిందనేది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) విచారణలో తేలనుంది.

2010లో రన్‌వే నుంచి విమానం కిందకు వెళ్లి ప్రమాదానికి గురవడంతో 158 మంది మరణించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..