మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా... సీనియర్ డైరెక్టర్‌ సలహా కోరిన బాలయ్య..

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయ‌న వార‌సుడి కోసం వేచి చూస్తున్నారు. నంద‌మూరి వంశం నుంచి కొత్త హీరో వ‌చ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. క‌ళ్యాణ్ రామ్ త‌ర్వాత ఆ కుటుంబం నుంచి కొత్త మొహం రాలేదు. దాంతో మోక్ష‌జ్ఞ కోస‌మే అభిమానుల ఎదురుచూపులిప్పుడు. దాంతో ఆయ‌న ఎప్పుడెప్పుడు వ‌స్తాడా అని చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మోక్షజ్ఞకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదనే వార్తల్లో ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో బాలయ్య అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. ఇప్పటికే బాలయ్య సెంచరీ మూవీతో మోక్షజ్ఞ ..స్పెషల్ ఎంట్రీ ఇస్తాడని అందరు అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌తోనైనా ఎంట్రీ ఇస్తాడనుకొని బాలయ్య అభిమానులు ఆశించారు. కానీ కుదరలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఇప్పటికే బోయపాటి శ్రీను,క్రిష్‌తో పాటు కొరటాల శివ, త్రివిక్రమ్‌లతో స్టోరీలు రెడీ చేయిస్తున్నాడు. అంతేకాదు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ నిర్మించడానికి సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, అశ్వినీదత్ వంటి నిర్మాతలు క్యూలో ఉన్నారు.

తాజాగా బాలకృష్ణ..సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస  రావును కలవడం ప్రాధాన్యత సంతరించురకుంది. హీరోగా బాలయ్యకు ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ వంటి అద్భుత చిత్రాలను అందించారు  సింగీతం. ఈ సినిమాలు నటుడిగా బాలకృష్ణకు మంచి పేరు తీసుకొచ్చాయి. అంతేకాదు గతంలో బాలయ్య తన వందో సినిమాను సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే తన ముద్దుల తనయుడు మోక్షజ్ఞను  గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసాడు.కానీ అనూహ్యంగా క్రిష్ దర్శకత్వంలో సెంచరీ మూవీగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక సినిమా చేసాడు. తాజాగా బాలకృష్ణ.. చాలా రోజుల తర్వాత సింగీతంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కొడుకు మోక్షజ్ఞను సింగీతం దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇప్పించాలనే కోరికతో బాలయ్య సింగీతం శ్రీనివాసరావును కలిసినట్టు సమాచారం.

ఇప్పటికే ఈ సీక్వెల్‌కు సంబందించిన కథతో పాటు అన్ని రెడీగా ఉన్నాయట. ఇక ‘ఆదిత్య 369’లో శ్రీకృష్ణదేవరాయలు బ్యాక్ డ్రాప్ ఉన్నట్టు.. ఈ సీక్వెల్‌లో కాకతీయుల కాలం నాటి బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. ఆ కాలానికి చెందిన చక్రవర్తిగా బాలకృష్ణ నటించబోతున్నట్టు సమాచారం. ఈరకంగా ఒకే తెరపై తండ్రీ కొడుకులను చూసే అవకాశం నందమూరి అభిమానులకు కలుగుతోంది. మొత్తానికి సింగీతం వంటి మోస్ట్ టాలెంటెట్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞకు  ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. బాలయ్య అభిమానులకు అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..