నేడు ఇంగ్లండ్తో భారత్ మ్యాచ్
ప్రపంచకప్లో ఆదివారం మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
ఈ టోర్నిలో ఎదురులేని భారత్ను ఆతిథ్య ఇంగ్లండ్ ఢీ కొననుంది.
ఈ మ్యాచ్లో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవా లని కోహ్లి సేన భావిస్తుండగా,
నేటి మ్యాచ్లో గెలుపుతో తమ సెమీస్ అవకాశాలను పదిలంగా ఉంచుకోవాలని ఇంగ్లండ్ కోరుకుంటుంది.
వరసగా రెండు మ్యాచ్ల్లో ఓడటంతో ఆతిథ్య జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
దీంతో నేటి మ్యాచ్లో ఆ జట్టు సర్వశక్తులూ ఒడ్డి పోరాటం చేయనుంది.
అయితే జోరు మీద ఉన్న భారత్ను అడ్డుకోవడం ఇంగ్లండ్కు అసాధ్యమే అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Post a Comment