కార్తికేయ ‘గుణ 369’ ట్రైలర్.. మాస్ ఇమేజ్ కోసం మొదలైన యజ్ఞం..
ఆర్ఎక్స్ 100 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఆర్ఎక్స్ 100 తర్వాత హిప్పి అనే సినిమాతో వచ్చినా కూడా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇక ఇప్పుడు ఈయన గుణ 369 సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన కథే ఇందులో కూడా కనిపిస్తుంది.
గొడవ పడితే గొడవలు తప్ప మరేం మిగలవు అనే లైన్తో వస్తున్నాడు కార్తికేయ. స్నేహితుడి కోసం గొడవ మొదలుపెట్టి.. చివరికి ఆ గొడవ ఎంతదూరం వెళ్లింది.. హీరోకు అది ఎలాంటి నష్టం తీసుకొచ్చింది అనేది ఈ చిత్ర కథ. అనఘ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఆగస్ట్లో సినిమా విడుదల కానుంది. ట్రైలర్ ఊర మాస్గా ఉంది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ చిత్రంతో కార్తికేయ తను కోరుకుంటున్న మాస్ ఇమేజ్ అందుకుంటాడో లేదో చూడాలి.
Comments
Post a Comment