సినిమాలకి గుడ్ బై..నటి హేమ సంచలన ప్రకటన
టాలీవుడ్ ప్రముఖ సినీనటి హేమ సంచలన ప్రకటన చేశారు. నిన్న సాయంత్రం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. తమ సొంతూరయిన రాజమండ్రిలో ఇల్లు కట్టుకుంటున్నానని, అది పూర్తి అవ్వగానే హైదరాబాద్ ని సినీ పరిశ్రమని వదిలేసి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్టు ప్రకటించారు.
అయితే ఈ సందర్భంగా ఆమె ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కాపుల కోసం బడ్జెట్లో రెండువేల కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయమని అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి స్థాపించిన 'జై సమైక్యాంధ్ర పార్టీ' తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసిన హేమ ఓటమిపాలయ్యారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆమె పార్టీలో చేరినా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదు. తాజాగా, సినీ పరిశ్రమకు దూరంగా పూర్తిగా రాజకీయాలకే అంకితం కావాలనుకుంటున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Comments
Post a Comment