ఒకే అమ్మాయి కోసం 5గురు యువకులు... ఇరువర్గాలు కత్తులతో దాడులు...!

ఒకే అమ్మాయిని అయిదుగురు అబ్బాయిలు ప్రేమించారు. దీంతో నేనేంటే నేనంటూ ఇద్దరు అబ్బాయిలు ఘర్షణకు దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే మధ్యవర్తిత్వానికి వెళ్లిన స్నేహితులు ఇద్దరికి కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో గాయాలైన వారిని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న సంఘటన హైదారాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

యువతి యువకుల్లో ప్రేమాయణం మాములైంది. అయితే ఒకే అమ్మాయిని ఇద్దరు ముగ్గురు కూడ ప్రేమించడం అమ్మాయి కోసం ఘర్షణలు పడడం కూడ రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. ఈనేపథ్యంలోనే టోలిచౌకి గుల్షన్ కాలనీకి చెందిన మహ్మద్ మసూద్ ,హకీంపేటకు చెందిన అబ్దుల్ ఖరీమ్, ప్యారామౌంట్ కాలనీకి చెందిన షారూఫ్,తోపాటు ,సలావుద్దిన్ రహ్మాన్, మహ్మాద్ హైమద్, మతీన్‌లు మురాదానగర్‌కు చెందిన షాహెదాషారాను ప్రేమించారు.

ఈ నేపథ్యంలోనే మతీన్, మరియు హైమద్‌ల మధ్య ఘర్షణ చెలరేగింది. తన ప్రేమకు అడ్డురావద్దంటూ సినిమా స్టైల్లో చెప్పేందుకు హైమద్ స్నేహితులు మతీన్‌కు బెదిరించేందుకు రంగంలోకి దిగారు. దీంతో మంగళవారం రాత్రీ టోలిచౌకిలోని బృందావన్ కాలనీలో మతీన్‌ను అటాక్ చేశారు.దీంతో విషయం తెలసుకున్న మతీన్ స్నేహితులైన మసూద్, కరీమ్‌లు అక్కడికి చేరుకుని గొడవను సర్థుమణిగే విధంగా ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు వర్గాలా ఘర్షణలో మధ్యలో వెళ్లిన మసూద్ ,కరీమ్‌లకు కత్తిపోట్లతో గాయాలపాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..