హైదరాబాద్‌ బయల్దేరాల్సిన విమానానికి ముప్పు తప్పింది

చిత్తూరు

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ బయల్దేరాల్సిన విమానానికి ముప్పు తప్పింది.

రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే.. దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది.

ఈ విషయాన్ని గమనించిన పైలట్‌ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్‌ చేశారు.

ఈ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

మొత్తానికి ప్రమాదాన్ని ముందే పైలట్‌ పసిగట్టడంతో.. అటు ఎయిర్‌పోర్టు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..