టీడీపీలో ఎంపీ కేశినేని టెన్షన్... నెక్ట్స్ ఎవరు ?

అసలే ఓటమి భారంతో సతమతమవుతున్న టీడీపీని సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని తెగ ఇబ్బందిపెడుతున్నారు. ట్వీట్ల ద్వారా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. మొదట మాజీమంత్రి దేవినేని ఉమ, ఆ తరువాత బుద్దా వెంకన్నను ఎంపీ కేశినేని నాని టార్గెట్ చేయడం టీడీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయాలంటూ ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి కేశినేని నాని ట్వీట్ చేయడం టీడీపీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు అంతర్గతంగా దృష్టి పెట్టినా... బయటకు మాత్రం ఆయన దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.

కేశినేని నానిపై టీడీపీ క్రమశిక్షణా పరమైన చర్యలు తీసుకుంటుందని ఆ పార్టీ కార్యకర్తలు భావించినా... ఈ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవడం మంచిదికాదనే భావనలో చంద్రబాబు ఉన్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్‌కు కారణమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాజీమంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను టార్గెట్ చేసిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని... ఆ తరువాత టీడీపీలో ఎవరిని లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేస్తారో అని టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ చేస్తున్న కేశినేని నాని... కచ్చితంగా బుద్ధా వెంకన్న తరువాత మరో టీడీపీ నేతపై విమర్శలు చేయడం ఖాయమని... అయితే ఆ నాయకుడు ఎవరు అన్నది ఆయనకు మాత్రమే తెలుసు అని కొందరు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసుకుంటున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని నెక్స్ట్ టార్గెట్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..