కొద్దిరోజులుగా ఉత్తరాదిలో తిష్ఠ వేసిన తూర్పు, పడమర ద్రోణి తూర్పు భాగం వాయువ్య బంగాళాఖాతానికి చేరింది

విశాఖపట్నం : 

కొద్దిరోజులుగా ఉత్తరాదిలో తిష్ఠ వేసిన తూర్పు, పడమర ద్రోణి తూర్పు భాగం వాయువ్య బంగాళాఖాతానికి చేరింది.

ఇదే సమయంలో అరేబియా సముద్రంలో రుతుపవన కరెంట్‌ ప్రభావంతో పడమర గాలులు వీస్తున్నాయి.

ఈ రెండింటి ప్రభావంతో బుధవారం ఒడిసా, బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో వర్షాల జోరు పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

ఈ నెల 23 వరకు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.

నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 32% లోటు వర్షపాతం నమోదైంది.

కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూ లు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం ఉంది.

కాగా, బుధవారం రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..