జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో వెంకటేశ్ అనే వ్యక్తికి ఇటీవల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ రోజు వెంకటేశ్ కిటికీకి టవల్తో ఉరి వేసుకొని జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఖైదీది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామం. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.
Comments
Post a Comment