మంత్రికే కోటి రూపాయలు ఇవ్వజూపిన సబ్ రిజిస్టార్ ?
విజయవాడ :
సుబ్రహ్మణ్యం పటమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ పోస్ట్ కోసం మధ్యవర్తి ద్వారా ఓ మంత్రికి కోటి రూపాయలు లంచం ఇస్తామనే విషయం చర్చనీయాంశం అయింది..
"పటమట రిజిస్ట్రార్" ఇప్పించండి అని అత్యంత ఖరీదైన ప్రాంతం పటమట సబ్ రిజిస్టర్ పోస్ట్ కోసం మంత్రి కే కమిషన్ ఇవ్వచూపిన వైనం మీడియా లో చక్కర్లు కొడుతోంది..
ప్రతి నిత్యం వందలాదిమంది రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది..
అయితే ప్రతి రిజిస్ట్రేషన్కు 2 నుంచి 5 శాతం వరకు ఇక్కడ వసూలు చేస్తున్నారు ..
కానూరు ,పటమట ,ఆటోనగర్ బెంజిసర్కిల్, తదితర ఖరీదైన ప్రాంతాలు ఈ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉండటం కలిసొచ్చే అంశం..
రోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతాయి..
అసైన్డ్ భూములు అన్యాక్రాంతం భూములు సరైన పఁతాలు లేని వాటిని కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడికి వస్తుంటారు ...
అందుకే ఖరీదైన పోస్ట్ గా పటమట సబ్ రిజిస్టార్ ఆఫీస్ ముద్ర పడింది ..
మంత్రి కే కోటి రూపాయలు ఇస్తామనడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చలోకి నిలిచింది పటమట రిజిస్టర్ కార్యాలయం...
Comments
Post a Comment