భారత్లో కియా మొట్టమొదటి మోడల్ ఇదే.. భారీగా బుకింగ్స్
హిందూపురం:
కియా మోటార్స్ వారి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యువీ) సెల్టోస్ ప్రీ బుకింగ్కు వినియోగదారులు ఎగబడ్డారు.
దేశవ్యాప్తంగా గల 206 సేల్స్ పాయింట్లతోపాటు ఆన్లైన్ ద్వారా మంగళవారం బుకింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బుధవారం సాయంత్రానికి 6,046 కార్లు బుక్ కాగా వీటిలో 1628 అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ అయ్యాయి.
భారతదేశంలో *కియా* మొట్టమొదటి మోడల్ను ఆన్లైన్ ద్వారా బుక్ చేయడానికి దేశమంతటా షోరూమ్లు అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఇందులో భాగంగా తొలిరోజే ఇంత పెద్దమొత్తంలో బుక్ కావడం విశేషం.
*పెనుకొండ మండలం అమ్మవారిపల్లి, ఎర్రమంచి* వద్ద నిర్మించిన *కియా* మోటార్స్ ఆఫ్ ఇండియా ప్లాంటులో ఈ కార్లు ఉత్పత్తి చేయనున్నారు.
డీజల్, పెట్రోల్ వేరియంట్లు, సెల్టోస్ మోడల్ కారు మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్లలో కంపెనీ అందిస్తోంది.
జూలై చివరి నాటికి డిస్ప్లే కోసం షోరూమ్లకు కార్లు చేరనున్నాయి.
మొత్తమ్మీద జిల్లాలో తయారైన *కియా* కారు త్వరలోనే రోడ్లపైకి రానుంది.
Comments
Post a Comment