ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్కు షాక్ ...
ఢిల్లీ:
గ్రీన్కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది.
యూనిట్ ధర 4.50 నుంచి రూ.2.44కి తగ్గించాలని గ్రీన్కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
ఈ ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని గ్రీన్కో కంపెనీ తేల్చిచెప్పింది.
రాజస్తాన్లో రూ.2.44కి యూనిట్ ఇచ్చినంత మాత్రాన ఏపీలో అదే ధరకు ఇవ్వడం కుదరదని గ్రీన్కో కంపెనీ స్పష్టం చేసింది.
జులై 12న గ్రీన్కో కంపెనీకి చెందిన మూడు యూనిట్లకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ట్రిబ్యునల్ తప్పుబట్టింది.
Comments
Post a Comment