తనకు సంబంధించిన డేటా చోరీ చేశారంటూ ఓ సినీ నటి

జూబ్లీహిల్స్‌:

తనకు సంబంధించిన డేటా చోరీ చేశారంటూ ఓ సినీ నటి బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌లో నివసించే సినీ నటి రాధాప్రశాంతి (47) నివాసానికి మే 13న చీరల డిజైనర్‌ లక్ష్మి తన కుమారుడు చక్రితో కలిసి వచ్చింది. వాట్సాప్‌ ద్వారా చీరల డిజైన్లు పంపుతానని రాధాప్రశాంతి చరవాణిని తీసుకున్న చక్రి.. గంటన్నర తరువాత తిరిగిచ్చి వెళ్లిపోయాడు. ఆ తరువాత తన చరవాణిని రాధాప్రశాంతి చూసుకోగా అందులో ఎలాంటి డిజైన్లు కనిపించలేదు. జీమెయిల్‌లోని డాటా కూడా కనిపించలేదని, ఫేస్‌బుక్‌లో ఉండాల్సిన ఒకరికి చెందిన ముఖ్యమైన ఫొటోలు లేవని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తన ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల తస్కరణ కారణంగా సమస్య తలెత్తే అవకాశం ఉందని.. లక్ష్మితోపాటు ఆమె కుమారుడు చక్రిపై కేసు నమోదు చేయాలని రాధాప్రశాంతి కోరారు. జీఎస్టీ కార్డు ఇస్తానని చెప్పి మే 14న రూ.25 వేలు తీసుకున్నట్లు సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 406, రెడ్‌ విత్‌ 34ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..