సోపోర్‌ పట్టణంలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు.

శ్రీనగర్‌ :

జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ పట్టణంలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు.

సోపోర్‌కు సమీపంలోని గుండ్‌బ్రాత్‌ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు బలగాలకు సమాచారం అందడంతో ఇవాళ ఉదయం అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు.

ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

అతని వద్ద ఉన్న ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ముందస్తు జాగ్రత్తగా సోపోర్‌ పట్టణంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..