ఆంధ్రప్రదేశ్లో గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు రూ.9.08 కోట్లు విడుదల
న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్లో గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు రూ.9.08 కోట్లు విడుదల చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.
రాజ్యసభలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రూ. 219.16 కోట్లతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 2018 ఏప్రిల్లో ఆమోదం తెలిపామని, భూమి కూడా గుర్తించామని చెప్పారు.
మరోవైపు ఏపీలోని బీసీ కోఆపరేటివ్ ఆర్థిక కార్పొరేషన్కు రూ.15కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి కృషన్ పాల్ తెలిపారు.
Comments
Post a Comment