‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి జ‌గ‌ప‌తిబాబును తప్పించడానికి కార‌ణం ఇదే..

హీరోగా ఉన్న‌పుడు ఎంత బిజీగా ఉన్నాడో.. ఇప్పుడు అంత‌కంటే ఎక్కువ బిజీ అయిపోయాడు సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు. ఒక్క‌సారి విల‌న్ అవ్వాల‌ని ఫిక్స్ అయిపోయిన త‌ర్వాత ఈయ‌న‌కు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ఇప్పుడు కూడా చేతినిండా సినిమాల‌తో బిజీగానే ఉన్నాడు ఈయ‌న‌. ఈ మ‌ధ్యే విడుద‌లైన మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమాలో కూడా ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు జ‌గ్గూభాయ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు నుంచి బ‌య‌టికి రావ‌డం ఆశ్చ‌ర్యంతో పాటు ఎన్నో అనుమానాలకు కూడా తావిస్తుంది.

కొంద‌రేమో అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి జ‌గ‌ప‌తిబాబును తీసేసారంటూ ప్ర‌చారం చేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం జ‌గ్గూ భాయ్ బ‌య‌టికి వ‌చ్చేసాడంటున్నారు. నిజ‌మేదైనా కూడా ఈయ‌న బ‌య‌టికి రావ‌డం మాత్రం జ‌రిగిపోయింది. దాంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారిప్పుడు. ఎందుకంటే మ‌హేష్ బాబుతో ఈయ‌న‌కు శ్రీమంతుడు, మహర్షి సినిమాల అనుబంధం ఉంది. జ‌గ‌ప‌తిబాబు ఈ సినిమా నుంచి బ‌య‌టికి రావ‌డానికి కార‌ణం ముందు ఆయ‌న‌కు చెప్పిన క‌థ‌.. ఆ త‌ర్వాత షూటింగ్‌కు వెళ్లిన తర్వాత కనిపించిన కథ మరోలా ఉండటమే అని తెలుస్తుంది.

అది ప్ర‌శ్నించినందుకే ఈ సినిమా ఆయ‌న చేజారింద‌ని తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూనే ఈ చిత్రం నుంచి జ‌గ్గూ భాయ్ వాకౌట్ చేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే సరిలేరు నీకెవ్వరు కోస‌మే ఓ తమిళ, కన్నడ సినిమాను జగపతిబాబు వ‌దులుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం. ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు స్థానంలో ప్ర‌కాశ్ రాజ్‌ను తీసుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్‌లో జ‌రుగుతుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..