ప్రగతి ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం లో దోపిడీ మిస్టరీ ని చేధించిన పోలీసులు
విజయవాడ :
ఈనెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్ పోర్ట్ లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు
పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు
సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు
ప్రగతి ట్రాన్స్ పోర్ట్ ను సంతోష్ త్రిపాఠి తో కలిసి వేణుగోపాల్ ప్రారంభించాడు
వర్కింగ్ పార్టనర్ గా ఉన్న వేణుగోపాల్ విభెదాలతో బయటకు వచ్చాడు
సంస్థలో జరిగిన నష్టాన్ని ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడు
వదిన కుమారుడు విశాల్ కు విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు
సిసి కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్ కు సూచనలు చేశాడు
విశాల్ , మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి మూడున్నర లక్షలు తెచ్చి వేణుగోపాల్ కు ఇచ్చారు
ఈ కేసు మిస్టరీ ని చేధించిన సిబ్బందికి రివార్డులు ఇస్తాం.
Comments
Post a Comment