ఇడుక్కి, మణప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్
తిరువనంతపురం :
కేరళ రాష్ట్రంలోపి ఇడుక్కి, మణప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఈ నెల 17, 18,19 తేదీల్లో మూడు రోజుల పాటు కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి, మణప్పురం, కన్నూర్, వయనాడ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.
దీంతోపాటు త్రిస్సూర్, ఎర్నాకులం జిల్లాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.
భారీవర్షాలు కురుస్తున్నందు వల్ల మత్స్యకారులు చేపల వేటకు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కేంద్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Post a Comment