స్వచ్ఛమైన బంగారం, వజ్రాలతో స్మార్ట్‌ఫోన్... ధర రూ.4,80,000

స్మార్ట్‌ఫోన్ రేట్ ఎంత ఉంటుంది? ధర స్పెసిఫికేషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు రూ.10,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటాయి. కాస్త మంచి స్పెసిఫికేషన్స్‌తో ఫోన్ కావాలంటే రూ.20,000 నుంచి రూ.40,000 వరకు ఖర్చు చేయాలి. ఇంకా హైఎండ్ ఫీచర్లతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కావాలంటే రూ.1,00,000 వరకు ఖర్చుపెట్టాల్సిందే. మరి ఓ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,80,000 అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. షావోమీ నుంచి రిలీజైన రెడ్‌మీ కే 20 ప్రో సిగ్నేచర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ధర ఇది. గురువారంఇండియాలో రెడ్‌మీ కే20 ప్రో, రెడ్‌మీ కే20 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ బ్లాక్ కలర్స్‌లో రిలీజ్ అయ్యాయి. షావోమీ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవి. రెడ్‌మీ కే20 ప్రో సిగ్నేచర్ ఎడిషన్ కూడా లాంఛ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది షావోమీ. స్వచ్ఛమైన బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఫోన్ ఇది. బంగారం, వజ్రాలు, మేకింగ్ ఛార్జీలు మొత్తం కలిపి రూ.4,80,000 అయినట్టు ప్రకటించింది షావోమీ. అయితే బంగారం, వజ్రాలతో తయారు చేసిన రెడ్‌మీ కే20 ప్రో సిగ్నేచర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,80,000 ధరకే అందించబోతున్నట్టు కంపెనీ తెలిపింది. కేవలం 20 స్మార్ట్‌ఫోన్లను మాత్రమే తయారు చేసింది షావోమీ. వాటిని ఎప్పుడు అమ్ముతారన్న విషయం ఇంకా వెల్లడించలేదు.

రెడ్‌మీ కే 20 ప్రో సిగ్నేచర్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్

ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855

రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర:
8జీబీ+256జీబీ- రూ.4,80,000

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..