మా ఇద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు
తాడికొండ MLA ఉండవల్లి శ్రీదేవి గారు వెల్లడించారు అదంతా కేవలం యెల్లో మీడియా సృష్టిఅని వారు స్పష్టంచేశారు
గురువారం గుంటూరు లోని జిల్లా పార్టీ కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు మాట్లాడుతూ ....
రాష్ట్రంలో ఇసుక మాఫియా అన్నది ఒక ముగిసిపోయిన అవినీతి అధ్యాయంగా అభివర్ణించారు.
దీనిని ఇంకా జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా ఖండించారు
అవినీతి ఏ రూపంలో ఉన్న దానిని అంతమోదించడం తమ ప్రభుత్వ లక్ష్యం ఆయన తెలిపారు
ఈ క్రమంలో తాను స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు కలిసి కట్టుగా అవినీతి నిర్మూలనకు నడుంబిగించామని తెలిపారు
ఇది సహించలేక మా ఇద్దరి మధ్య అగాధం ఉన్నట్లుగా తప్పుడు వాతావరణం సృష్టించారని మండిపడ్డారు
నిజానికి తాము ఇద్దరం వైసీపీ లో క్రమ శిక్షణ కలిగిన నేతలమే కాక దగ్గర బంధువులమే అని తెలిపారు
ఇప్పటికైనా విషప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు లేని పక్షంలో స్థానిక ప్రజలే గుణపాఠం తెలుపుతారు అని హెచ్చరించారు.
Comments
Post a Comment