మూడేళ్ల చిన్నారి కిడ్నాప్... ఎలా దొరికాడంటే...
తమిళనాడు... చెన్నైలో... జరిగిందీ ఘటన. మూడేళ్ల చిన్నారి వెంటపడిన ఓ దొంగ... ఆ పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి... మరిన్ని కొనిపెడతానంటూ.... తనతో తీసుకుపోయాడు. ఐతే... అతను ఎత్తుకుపోతున్నప్పుడు మొత్తం 8 సీసీ కెమెరాల్లో కనిపించాడు. వాటి ఆధారంగా అతను పాత నేరస్థుడే అని గుర్తించిన పోలీసులు... పాత నేరస్థుల డైరీలోని అతని అడ్రెస్కు వెళ్లారు. ఆ టైంలో తన ఇంట్లో ఏడుస్తున్న పిల్లాణ్ని చితకబాదుతూ కనిపించాడు దొంగ. వెంటనే పిల్లాణ్ని కాపాడి... దొంగను జైలుకు తరలించారు... తర్వాత చిన్నారిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Post a Comment