డోక్లామ్‌లో ప్ర‌స్తుతం ప‌రిస్థితి శాంతియుతంగానే ఉంద‌ని కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

లోక్ సభ

డోక్లామ్‌లో ప్ర‌స్తుతం ప‌రిస్థితి శాంతియుతంగానే ఉంద‌ని కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

లోక్‌స‌భ‌లో ఇవాళ ఆయ‌న మాట్లాడారు. డోక్లామ్ స‌మ‌స్య విష‌యంలో భార‌త్‌, చైనాలు సంయ‌మ‌నం పాటిస్తున్నాయ‌న్నారు.

స‌రిహ‌ద్దు వ‌ద్ద శాంతి వాతావ‌ర‌ణం కోసం రెండు దేశాలు క‌ట్ఠుబ‌డి ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు.

ప్ర‌స్తుతం ఉన్న బోర్డ‌ర్ ఒప్పందాల‌ను రెండు దేశాలు గౌర‌విస్తున్నాయ‌న్నారు.

దేశ భద్ర‌త కోసం చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద మౌళిక‌సదుపాయాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

రోడ్లు, ట‌న్నెళ్లు, రైల్వేలైన్లు, విమానాశ్రాయాల‌ను నిర్మిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..