సీఎం జగన్పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.
గుంటూరు:
అసెంబ్లీలో జగన్ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా? అని అడిగారు.
తాను ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా?, వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కుతారా?, వైసీపీ పోరాటాలకు.. పార్టీ గెలుపునకు మాదిగలు ఉపయోగపడింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
24 గంటల్లో వర్గీకరణపై జగన్ తన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
లేనిచో 48 గంటల్లో వైసీపీ ప్రభుత్వంపై మా వైఖరి ప్రకటిస్తామన్నారు.
Comments
Post a Comment