23 మంది ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే..: జగన్పై నారాయణ ధ్వజం
అమరావతి :
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాము 151 మంది శాసనసభ్యులం ఉన్నామని, తామంతా లేస్తే 23 మంది శాసన సభ్యులు అసెంబ్లీలో నిలవగలరా? అని మండిపడ్డారు.
దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సీపీఐ నేత నారాయణ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.
‘‘మేము 151 మంది శాసన సభ్యులం ఉన్నాము.. మేమంతా లేస్తే మీ 23 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో నిలవగలరా?’ అత్యున్నత శాసనసభలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి గారు టీడీపీని ఉద్దేశించి మాట్లాడారు.
శాసనసభలో 23 మంది ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే.. ఇక చట్టసభలలో తక్కువ మంది ఉన్న ప్రతిపక్షాలపై అప్రకటిత నిషేధమేనా?
Comments
Post a Comment