ఆసక్తి పుట్టిస్తున్న బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్.. లిస్ట్లో వాళ్లు కూడా..
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 ఇంకా మొదలే కాలేదు కానీ మొదలయ్యే ముందే రోజుకో కొత్త సంచలనం సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి హోస్ట్ ఎవరనే ప్రశ్నలకు తెరతీస్తూ నాగార్జున అని కన్ఫర్మ్ చేసారు. ఈ మద్యే విడుదలైన ప్రోమో కూడా దుమ్ము దులిపేస్తుంది. ఇక ఇప్పుడు అసలైన ఆసక్తి కంటెస్టెంట్లపై ఉంది. ఓ సారి రేణు దేశాయ్ వస్తుందనే వార్తలు వస్తే.. మరోసారి మాధవిలత అంటున్నారు. ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఈ సారి హౌజ్లోకి వచ్చే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
ఒక్కరో ఇద్దరో కాదు.. ఈ సారి అంతా పేరున్న వాళ్లనే ఇంట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువగా ఈ సారి కనిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఓ ఇద్దరు సంచలన తారల పేర్లు మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. తెలుగు మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ వార్తలు సావిత్రి ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుందనే ప్రచారం జరుగుతుంది. గత సీజన్లో యాంకర్ శ్యామల వెళ్లింది. ఈ సారి సావిత్రి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఆమెతో పాటు యాంకర్ శ్రీముఖి కూడా ఈ సారి లిస్టులో ఉంది.
యాంకర్ శ్రీముఖితో పాటు ఒకప్పుడు వరస విజయాలతో ఇండస్ట్రీని ఊపేసిన లవర్ బాయ్ తరుణ్ కూడా ఈ సారి ఇంట్లోకి వస్తున్నాడని తెలుస్తుంది. ఆయనకు తోడుగా మరో హీరో వరుణ్ సందేశ్, కొరియోగ్రఫర్ రఘు మాస్టర్, గాయని శ్రావణ భార్గవి భర్త హేమచంద్ర, యూ ట్యూబ్ సెన్సేషన్ గాయత్రి గుప్తా, సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా ఈ సారి బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. టిక్ టాక్ సెన్సేషన్ ఉప్పల్ బాలు కూడా ఈ సారి హౌజ్ మేట్స్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది.
కమెడియన్ వైవా హర్ష, యాంకర్ జాహ్నవి, పొలిటికల్ కమెడియన్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ కూడా ఇంటి సభ్యులుగా పంపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జులై చివర్లో బిగ్ బాస్ 3 మొదలు కానుంది. 100 రోజుల పాటు జరగబోయే ఈ షోపై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు.
Comments
Post a Comment