తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది.
శ్రీ వారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.
సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.
83,183 మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలిగింది.
నిన్న 30,755 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Post a Comment