ఇంజనీర్ పై బురద పోసి ... బ్రిడ్జ్ కి కట్టేసిన ఎమ్మెల్యే .

ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు పీక్ స్టేజ్‌కు చేరింది.

కొంద‌రు ఎమ్మెల్యేలు పైశాచిక ఆనందంతో ఊగిపోతున్నారు. ఇటీవ‌ల ఇండోర్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే..

మున్సిప‌ల్ ఆఫీస‌ర్‌ను బ్యాట్‌తో కొట్టిన విష‌యం తెలిసిందే.

తాజాగా గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఓ ఇంజినీర్‌పై బ‌కెట్ల‌తో బుర‌ద పోశాడు.

కంకావ‌లి వ‌ద్ద ముంబై-గోవా ర‌హ‌దారిపై ఉన్న బ్రిడ్జ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఎమ్మెల్యే నారాయ‌ణ రాణే, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు.. ఇంజినీర్ ప్ర‌కాశ్ షెడేక‌ర్‌పై బ‌కెట్ల ద్వారా బుర‌ద‌ను పోశారు.

ఆ త‌ర్వాత ఆ ఇంజినీర్‌ను బ్రిడ్జ్‌కు క‌ట్టేశారు. హైవేపై గ‌తుకులు ఉన్న‌ట్లు గుర్తించిన ఎమ్మెల్యే, అత‌ని అనుచ‌రులు త‌మ ఆగ్ర‌హాన్ని ఇంజినీర్‌పై చూపించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?