ఇసుక అక్రమ రవాణా నియంత్రణ బాధ్యత మీదే....నంబూరి

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజవర్గం అచ్చంపేట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న స్పందన కార్యక్రమానికి వెళుతున్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మార్గం మధ్యలో ఆగి ఉన్న లారీలను చూసి తన కాన్వాయ్ పక్కకు ఆపి ఏమయినా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందేమో అని ఆరా తీశారు.ఒక వేళ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే  వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోని కేసులు నమోదు చేయాలని అక్కడే ఉన్న సీఐ కి తెలిపారు,ప్రభుత్వ కట్టడాల పనులకు కూడా ఖచ్చితంగా అనుమతి తీసుకొని ఉంటేనే రవాణా చేయాలి అని సూచించారు.. అదే విధంగా లారీ డ్రైవర్లకు, క్లినర్ లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. ఇంకా కొద్ది రోజుల్లో ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెస్తుందని అప్పటి వరకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసుకునే బాద్యత పోలీస్ అధికారాల మీద ఉంది అని వాళ్లకు భాద్యతలు గుర్తు చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?