రైతుల కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

అనంతపురం

జిల్లాలో వేరుశనగ విత్తనం కోసం రైతుల కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

విత్తన పంపిణీలో జాప్యంపై అధికారుల తీరును నిరసిస్తూ..... ఉరవకొండలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.

ఉరవకొండ - గుంతకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.

ఐదు గ్రామాలకు చెందిన రైతులకు విత్తన పంపిణీ చేస్తామని చెప్పిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తోపులాట జరిగిందని, పంపిణీ సరిగా జరగలేదని రైతు సంఘం నాయకులు తెలిపారు.

పోలీసులు..... రైతులందరికీ విత్తన పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాక ఆందోళన విరమించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?