రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా, తర్వాత 24 గంటల్లో తుఫాన్‌గా

విశాఖపట్నం: 

లక్షద్వీప్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం బలపడి ఆదివారం ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది.

ఇది మరింత బలపడి రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా, తర్వాత 24 గంటల్లో తుఫాన్‌గా మారనుంది.

దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదలనున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

సోమవారంనాటికి కేరళలోని మిగిలిన ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని పలుప్రాంతాలు, తమిళనాడులో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి.

కాగా, అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే క్రమంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?