నాడు రైతుల పక్షం..

నేడు ప్రభుత్వ పక్షం ..

నేను ఎక్కడ ఉన్నా ఎప్పటికీ రైతు పక్షపాతినే  అని అంటారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి....

అయితే గతంలో రాజధాని భూములు విషయంలో గత ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక విధానాలకు ఎదురు నిలిచి పోరాడిన ఎమ్మెల్యే నేడు అదే ప్రాంతంలో రాజధాని అభివృద్ధి మండలి (సి ఆర్ డి ఏ) చైర్మన్ గా నియమితులయ్యారు ..

ప్రభుత్వం మారినా ఈ  ప్రాంతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన  రైతుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి...

రానున్న కాలంలో  రైతు సమస్యలపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన సమయం ఉన్నది...

రాజధాని నిర్మాణం పేరుతో మంగళగిరి తాడేపల్లి తుళ్లూరు పరిధిలోని 29 గ్రామాల్లో రైతులు దగ్గర బలవంతంగా భూములు లాక్కొని

ఇప్పటికీ కొంతమంది రైతులకు  న్యాయం చేయకుండా గత  ప్రభుత్వం  మోసం చేసినట్లు
వారందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు..

ఆరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలు.

దాదాపు 985 రెవిన్యూ గ్రామాల పరిధిలో
సి ఆర్ డి ఏ సంస్థ అమరావతి రాజధాని అభివృద్ధికి  ప్రధాన పాత్ర పోషిస్తుంది..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?