భారత విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటాయి.
న్యూఢిల్లీ
భారత విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటాయి.
'క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ర్యాంకింగ్స్-2020'లో దేశంలోని ప్రముఖ విశ్వ విద్యాలయాలకు స్థానం దక్కింది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి 200 విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు నిలిచాయి.
అగ్రశ్రేణి 400 జాబితాలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పుర్, ఐఐటీ కాన్పుర్, ఐఐటీ రూర్కీ ఉన్నాయి.
1000 జాబితాలో ఓపీ జిందాల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (జేజీయూ) సహా 50 కొత్త సంస్థలు ఉన్నాయి.
స్థాపించిన అతి కొద్ది కాలంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న విద్యాసంస్థగా జేజీయూ నిలిచింది.
అగ్రశ్రేణి 200 జాబితాలో భారత విద్యాసంస్థలు రాణించటంపై కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ హర్షం వ్యక్తం చేశారు
Comments
Post a Comment