జమ్ముకశ్మీర్ రిజర్వేషన్, ఆధార్ చట్ట సవరణ బిల్లులు నేడు లోక్సభ ముందుకు వచ్చాయి.
న్యూఢిల్లీ
ఆధార్, జమ్మకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు సహా మరిన్ని చట్ట సవరణ బిల్లులు నేడు లోక్సభ ముందుకు వచ్చాయి.
సవరణలపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు.
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్, ఆధార్ చట్ట సవరణ బిల్లులు నేడు లోక్సభ ముందుకు వచ్చాయి.
ఆధార్తో పాటు భారతీయ టెలిగ్రాఫ్, మనీలాండరింగ్ నిరోధక చట్ట సవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు.
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరఫున ఆ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు.
ఆధార్-2016 చట్ట సవరణ ఆమోద ప్రక్రియ పూర్తయితే బ్యాంకు ఖాతా తెరిచేందుకు, కొత్త ఫోన్ కనెక్షన్(సిమ్కార్డు) కోసం ఆధార్ తప్పనిసరి కాదు. వినియోగదారుడు ఇష్టముంటే స్వచ్ఛందంగా గుర్తింపులా వాడుకోవచ్చు.
సవరణల సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానమిచ్చారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.
ఆధార్ కార్డు ఎవరి గోప్యతకు భంగం కలిగించదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలను ఆధార్ సంరక్షిస్తోందని చెప్పారు.
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు.
ఈ సవరణ ప్రకారం జమ్ముకశ్మీర్లో వాస్తవాధీన రేఖ వెంబడి 10 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న వారు నేరుగా ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల్లో రిజర్వేషన్లు పొందొచ్చు.
కొందరు విపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించగా, వారి డిమాండ్లను స్పీకర్ ఓం బిర్లా తోసిపుచ్చారు.
Comments
Post a Comment