యువకుడిని కత్తెరతో పొడిచి చంపారు...రెండు రోజుల్లో ఆరో హత్య
దేశ రాజధానిలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా గాంధీనగర్ ప్రాంతంలో మరో దారుణ హత్య జరిగింది. 19 ఏళ్ల అసబ్ను కిరాతకంగా చంపేశారు దుండగులు. మృతుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పొత్తి కడుపులో కత్తెరతో పొడిచి చంపారని వెల్లడించారు. మృతుడు గాంధీనగర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా రూమ్మేట్స్ అతడి డెడ్బాడీని గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment