నీట్లో అర్హత పొందిన విద్యార్థులు..
అమరావతి
నీట్లో అర్హత పొందిన విద్యార్థులు.. వైద్య విద్యకు దరఖాస్తు చేసుకునే తేదీలను వర్సిటీ అధికారులు ప్రకటించారు.
ఈ నెల 22 నుంచి 28 వతేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ అప్పలనాయుడు తెలిపారు.
నీట్లో రాష్ట్రానికి సంబంధించి.. 40 వేల 381 విద్యార్థులు అర్హత పొందారు.
వైద్య విద్య అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు.. జులై ఒకటో తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు.
ఏ కాలేజీలో సీటు వచ్చిందో విద్యార్థుల సెల్ఫోన్కు నేరుగా సందేశం వెళ్తుంది.
ఈ ప్రక్రియ అంతా జులై నెలాఖరుకు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఆగష్టు ఒకటో తేదీ నుంచి వైద్య విద్యార్థులకు తరగతులు మొదలవుతాయని రిజిస్ట్రార్ తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కౌన్సెలింగ్లో అమలుచేస్తామని వెల్లడించారు.
Comments
Post a Comment