భారత్ పొరుగు దేశాలైన మాల్దీవులు, శ్రీలంకల్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
న్యూఢిల్లీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు మాల్దీవులకు వెళ్లనున్నారు ప్రధాని...
అనంతరం ఆదివారం శ్రీలంకలోనూ పర్యటిస్తారు.
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనగా భారత్ పొరుగుదేశాలనే ఎన్నుకున్నారు మోదీ.
ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకే భారత్ తొలి ప్రాధాన్యమిస్తుందన్న విధానానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
తనను మాల్దీవులకు ఆహ్వానించినందుకు ఆ దేశాధ్యక్షునికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment